కిరాతకుడు : పెళ్లాన్ని నరికి చంపి.. ఆ తలతో రోడ్డుపై పరేడ్

కిరాతకుడు : పెళ్లాన్ని నరికి చంపి.. ఆ తలతో రోడ్డుపై పరేడ్

చంపటం అనే మాట వింటేనే ఒళ్లు వణికిపోతుంది.. అలాంటిది కట్టుకున్న పెళ్లాన్ని అత్యంత కిరాతకంగా చంపాడు.. ఆ తర్వాత భార్య తలను.. శరీరం నుంచి వేరు చేశాడు. ఆ తలతో నడి రోడ్డుపై పరేడ్ చేశాడు. ఊర్లోని ఓ టీ షాపు దగ్గర పెళ్లాం తలను పక్కన పెట్టుకుని.. ఎంతో హుందా.. ప్రశాంతంగా టేబుల్ పై కూర్చున్నాడు. ఏదో ఘనకార్యం చేసినట్లు.. అద్భుతం చేసినట్లు ఒంటి నిండా రక్తంతో వీడు ప్రవర్తన చూసి ఊర్లోని జనం అంతా షాక్ అయ్యారు. కిరాతకులకే కిరాతకుడుగా ఉన్న వీడు పూర్తి వివరాలు తెలుసుకుందామా. 

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో గుచాయిత్‌ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతనికి  భార్యతో పాటుగా మైనర్ కొడుకు కూడా ఉన్నాడు.  వృత్తిరీత్యా చిరువ్యాపారుడైన గుచైత్  తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య  గొడవలు జరుగుతున్నాయి.  ఈ క్రమంలో ఫిబ్రవరి 14వ తేదీన  మరోమారు ఇద్దరికి గొడవ జరగగా...  కోపంతో  తన భార్య తల నరికేశాడు గుచాయిత్‌.  ఆపై ఒక చేతితో తన భార్య తలను మరో చేతిలో కత్తిని పట్టుకుని  బయటకు వచ్చాడు. 

Also Read: మీకెలా ఉందోకానీ.. మాకు: సన్నిలియోన్ స్టయిల్లో మంచు లక్ష్మి ఫొటోషూట్

స్థానికంగా ఉన్న ఓ  టీ దుకాణానికి చేరుకుని ఒక బెంచ్‌పై ఎంతో దర్జాగా  కూర్చున్నాడు.  స్థానికులు గుచాయిత్ ను చూసి భయంతో  అతని దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేదు. చివరకు పటాష్‌పూర్ పోలీస్ స్టేషన్  పోలీసులు అక్కడికి  చేరుకుని గుచాయిత్‌ను అరెస్టు చేశారు.   మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు.  గుచాయిత్‌ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు పోలీసులకు తెలిపారు.  2021 మార్చిలో  కోల్‌కతాలోని అలీపూర్ జూలాజికల్ గార్డెన్‌లో సింహం బోనులోకి చొరబడినందుకు అతన్ని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో గుచాయిత్‌ బయటపడ్డాడు.