పోలీస్​ స్టేషన్​ ముందు పురుగుల మందు తాగి సూసైడ్

పోలీస్​ స్టేషన్​ ముందు పురుగుల మందు తాగి సూసైడ్
  • అప్పుల బాధలు, భార్యతో గొడవలే కారణం

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి  జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి  గ్రామానికి చెందిన ఎలివేణి  రాజయ్య (50)  బుధవారం పోలీసు విచారణకు హాజరయ్యేందుకు  వెళ్లి  పోలీస్ స్టేషన్  ముందు పురుగుల మందు తాగి చనిపోయాడు. రాజయ్యకు ఆయన భార్య కోమలకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్తపై  ఆమె సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేసింది. రాజయ్యను విచారించడానికి పోలీసులు స్టేషన్​కు పిలిపించారు. దీంతో రాజయ్య సుల్తానాబాద్ చేరుకొని దారిలో నడుచుకుంటూ వస్తూనే పురుగుల మందు తాగి వచ్చి పోలీస్ స్టేషన్ వద్ద పడిపోయాడు.

గమనించిన పోలీసులు అతన్ని వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స చేయించారు. కండిషన్​ సీరియస్​ గా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. చికిత్స పొందుతూ రాజయ్య చనిపోయాడు. కాగా, కొంతకాలం కింద బతుకుదెరువు కోసం రాజయ్య మస్కట్ వెళ్లి తిరిగొచ్చాడు. అప్పుల పాలు కావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పుల బాధతో మనస్తాపం చెంది రాజయ్య సూసైడ్​ చేసుకున్నాడని అతడి సోదరి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.