భర్తతో ఫోన్ లో మాట్లాడుతూనే బిల్డింగ్ పైనుంచి దూకింది

భర్తతో ఫోన్ లో మాట్లాడుతూనే బిల్డింగ్ పైనుంచి దూకింది

శేరిలింగంపల్లి, వెలుగు: భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ బిల్డింగ్ ​పైనుంచి దూకి ఓ వివాహిత సూసైడ్​ చేసుకుంది. కరీంనగర్​కు చెందిన మార్కండేయ, రాధ దంపతుల కూతురు శ్రీవిద్య(27), వరంగల్ ​జిల్లా భూపాలపల్లికి చెందిన బంధువు శబరీశ్ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో గత ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.  హైదరాబాద్‌లోని చందానగర్​లో శ్రీదేవి థియేటర్​ఎదురుగా ఉన్న ఇంట్లో రెంటుకు ఉంటూ దంపతులిద్దరూ సాఫ్ట్​వేర్​ జాబ్​లు చేస్తున్నారు.  పెళ్లయిన కొన్ని రోజుల నుంచే భార్యని శబరీశ్ వేధిస్తున్నాడు.  చందానగర్​లోనే ఓ  అపార్టుమెంట్​లో తన అక్క వద్ద ఉంటున్న తల్లిదండ్రులకు శ్రీవిద్య పలుసార్లు తన బాధను చెప్పుకొంది. కుటుంబసభ్యులు ఆమెకు నచ్చజెప్పారు. ఈనెల14న శబరీశ్​ పార్టీ ఉందని చెప్పి బెంగళూరు వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం శ్రీవిద్య తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అదే సమయంలో భర్త ఫోన్ ​చేయడంతో  ఘర్షణ పడుతూనే  ఐదో అంతస్తు పైకి వెళ్లి కిందకు దూకింది. తీవ్ర గాయాలవడంతో  ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చందానగర్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.