చాంద్రాయణగుట్టలో వైన్ షాపులో చోరీ 

చాంద్రాయణగుట్టలో వైన్ షాపులో చోరీ 

హైదరాబాద్ : చాంద్రాయణగుట్టలోని ఓ వైన్ షాపులో భారీ చోరీ జరిగింది. మద్యం దుకాణం పై కప్పు రేకులను కత్తిరించి.. షాపులోకి చొరబడ్డారు దొంగలు. కౌంటర్ లోని నగదు, మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట గాంధీ విగ్రహం లేన్ లోని విజయ్ వైన్స్ షాపులో రాత్రి జరిగింది. వైన్స్ షాపు నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

దాదాపు రూ.40 నుంచి 50 వేల వరకూ నగదు, ఐదారు వేల విలువ చేసే మద్యం బాటిళ్లు చోరీకి గురయ్యాయని షాపు నిర్వాహకులు తెలియజేశారు. దుండగులు సీసీ కెమెరా వైర్లను కట్ చేసి, లోపలికి ప్రవేశించి చోరీ చేశారని ఫిర్యాదు చేశారు.