యూపీలో కారు-ట్రక్కు ఢీ.. 8 మంది సజీవదహనం

యూపీలో కారు-ట్రక్కు ఢీ.. 8 మంది సజీవదహనం
  • –యూపీలో కారు-ట్రక్కు ఢీ..8 మంది సజీవదహనం 
  • పెళ్లికి హాజరయ్యేందుకు వెళుతుండగా దారుణం

లక్నో : ఉత్తరప్రదేశ్​లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి బరేలీ వద్ద నైనిటాల్ హైవేపై కారు–ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం..సుమిత్ గుప్తా అనే వ్యక్తికి చెందిన కారును కొంత మంది అద్దెకు తీసుకున్నారు. పెళ్లికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డీవైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. 

అందులోని వారంతా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, సెంట్రల్ లాక్ పడి కారు డోరు తెరుచుకోకపోవడంతో ఎనిమిది మంది కారులోనే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. డెడ్​ బాడీ ను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.