తండ్రిని పోషించలేక హత్య చేసిన కొడుకు

తండ్రిని పోషించలేక హత్య చేసిన కొడుకు
  • వనపర్తి జిల్లా చిమనగుంటపల్లిలో ఘోరం

వనపర్తి, వెలుగు :  వనపర్తి సమీపంలోని చిమనగుంటపల్లిలో ఓ వృద్ధుడిని పోషించలేక అతడి కొడుకు దారుణంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన తెలుగు బచ్చయ్య(80) రైతు. ఇతడికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు. బుచ్చయ్య ఈ మధ్య వృద్ధాప్యంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అతడిని పోషించే బాధ్యతను మిగతా ఇద్దరు కొడుకులు ఒప్పందం మీద పెద్ద కొడుకైన పెద్ద కురుమయ్యకు అప్పగించారు.

ఆవారగా తిరిగే కురుమయ్య తండ్రిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో కుటుంబసభ్యులు మందలించారు. సోమవారం మధ్యాహ్నం ఇంటి ముందు మంచంలో పడుకున్న తండ్రి గొంతు కోసి చంపాడు. నిందితుడు నేరం ఒప్పుకున్నాడని వనపర్తి రూరల్  ఎస్ఐ నాగన్న తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.