వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం అవుతాపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అర్థరాత్రి సమయంలో విగ్రహాన్ని దుండగులు పడగొట్టారు. గత నెల 16వ తేదీన వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆవిష్కరించారు. వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3800 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా అవుతాపురం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. గత నెల 16వ తేదీన ఉద్రిక్తతల నడుమ విగ్రహావిష్కరణ జరిగిన విషయం తెలిసిందే.