
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల కష్టం మామూలుగా లేదు. ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితులు ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో నెలకొన్నాయి. బడా కంపెనీలు సైతం నిర్దాక్షిణ్యంగా టెక్కీలను తొలగిస్తున్నాయి. జాబ్పోయి కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతున్న బాధితులు సోషల్మీడియా వేదికగా తమ బాధలు షేర్ చేసుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ లో పని చేసిన ఒక ఉద్యోగికి ఇటీవలే కంపెనీ పింక్స్లిప్ఇచ్చింది.
అప్పటినుంచి ఆయన లింక్డిన్ద్వారా వేర్వేరు కంపెనీల్లో సుమారు 1000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ తనకు ఎదురైన అనుభవంతో షాక్ తిన్నాడు. వెయ్యికి పైగా దరఖాస్తులు పంపినా ఒక్కరంటే ఒక్కరి నుంచి కూడా ఉద్యోగ ఆఫర్లు రావట్లేదని సోషల్మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. అర్ధాంతరంగా ఉద్యోగం తీసేయడం వల్ల తన కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాడు.
టెక్ ఇండస్ట్రీలో కోతల కాలం...
అంతర్జాతీయంగా ఉన్న మాంద్యం కారణంతో టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా పలు కంపెనీలు వర్క్ఫ్రం హోం ఆఫర్ చేస్తుండగా, మరి కొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. సాఫ్ట్వేర్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కోతల కాలం నడుస్తోంది. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విటర్లాంటి పెద్ద కంపెనీలతో పాటు పలు చిన్న కంపెనీలు సైతం ఇదే బాటలో నడుస్తున్నాయి.
ఉద్యోగం కోల్పోయిన వారు రోజు రోజుకీ పెరుగుతుండటంతో మార్కెట్లో పోటీ విపరీతంగా ఉంటోంది. మే 2023 వరకు దాదాపు రెండు లక్షల మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయారు. మాంద్యం ప్రభావంతోనే ఇదంతా అని చెబుతున్న ఎకనమిస్ట్లు ఈ ఏడాది చివరి వరకు ఐటీ మార్కెట్ కోలుకోవడం కష్టమేనని స్పష్టం చేస్తున్నారు.