టెన్త్ ఫెయిల్.. మనస్తాపంతో స్టూడెంట్ సూసైడ్

టెన్త్  ఫెయిల్.. మనస్తాపంతో స్టూడెంట్ సూసైడ్
  • వికారాబాద్ జిల్లా కిష్టాపూర్​లో ఘటన

పరిగి, వెలుగు:  టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్​లో ఫెయిలైన ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా  దోమ మండలం కిష్టాపూర్​ గ్రామంలో జరిగింది. కిష్టాపూర్​కి చెందిన కుందేల కిష్టయ్య పెద్ద కొడుకు నందు(16) స్థానిక హై స్కూల్​లో  టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్​లో టెన్త్ ఎగ్జామ్స్ రాయగా మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఫెయిలయ్యాడు. జూన్ లో సప్లిమెంటరీ ఎగ్జామ్ రాశాడు. శుక్రవారం టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్ కాగా నందు మళ్లీ ఫెయిలయ్యాడు. 

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నందు సూసైడ్​ చేసుకున్నాడు. శనివారం ఉదయం గ్రామ శివారులోని చింతచెట్టుకు నందు ఉరేసుకుని కనిపించాడు.  నందు తండ్రి కిష్టయ్య ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేశామని ఎస్సై విశ్వజన్ తెలిపారు.