- ఆపై అకౌంట్లోని డబ్బులు విత్డ్రా
జూబ్లీహిల్స్, వెలుగు: కాల్ చేసుకుంటానని ఓ వ్యక్తి ఫోన్ కొట్టేసిన దొంగ బాధితుడిని అకౌంట్లోని డబ్బులు కూడా విత్ డ్రా చేశాడు. బిహార్ రాష్ట్రానికి చెందిన విష్ణుకుమార్(20) మధురానగర్ లోని ఓ హోటల్ లో మూడేండ్లుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 18న గుర్తుతెలియని వ్యక్తి మాస్క్ పెట్టుకుని ఒక ఫోన్ చేసుకుంటానని అతని మొబైల్ తీసుకున్నాడు. అనంతరం కాల్ మాట్లాడుతున్నట్లు నటించి పరారయ్యాడు. అనంతరం తన అకౌంట్లోని రూ.62 వేల నగదును విత్ డ్రా చేసినట్లు బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
