హైదరాబాద్, వెలుగు: ప్రీమియం డిస్ప్లే సొల్యూషన్లకు డిమాండ్ భారీగా పెరగడంతో తెలంగాణలో గత ఏడాది 27 శాతం వృద్ధి సాధించినట్టు తైవాన్కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బెన్క్యూ ప్రకటించింది. కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ సింగ్హైదరాబాద్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్సీడీ మానిటర్ల అమ్మకాల్లో తెలంగాణ మార్కెట్నుంచి తమకు ఎనిమిది శాతం వాటా ఉందని చెప్పారు.
దక్షిణ భారతదేశం మొత్తం రెవెన్యూలో ఈ రాష్ట్రం 19 శాతం వాటాను అందిస్తూ, కంపెనీ వృద్ధికి కీలక ఇంజిన్గా మారిందని వెల్లడించారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ స్మార్ట్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ కింద 8,700కుపైగా ఇంటరాక్టివ్ డిస్ప్లే మానిటర్లను అమర్చామని ప్రకటించారు. తమకు రాష్ట్రవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ మంది చానెల్ పార్టనర్లు, ఎనిమిది సర్వీస్ సెంటర్లు ఉన్నాయని సింగ్ పేర్కొన్నారు.
