సర్పంచ్ దూషించాడని కాలర్‌ పట్టిన వార్డు మెంబర్

సర్పంచ్ దూషించాడని కాలర్‌ పట్టిన వార్డు మెంబర్

సర్పంచ్ దూషించాడని కాలర్‌ పట్టిన వార్డు మెంబర్

పర్వతగిరి, వెలుగు : తనను బూతులు తిట్టాడని ఓ వార్డుమెంబర్​ సర్పంచ్​కాలర్​ పట్టి నిలదీసింది.  వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం ఇస్లావత్​ తండా ఉప సర్పంచ్ పీర్యా సంతకాన్ని ఫోర్జరీ చేసి స్థానిక సర్పంచ్ ఇస్లావత్ రమేశ్​ డబ్బులు  డ్రా చేశారని వరంగల్ డీపీవోకు ఫిర్యాదు చేశారు. గురువారం ఈ విషయమై ఎంపీవో  పాక శ్రీనివాస్​ గ్రామపంచాయతీ ఆఫీస్​లో ఎంక్వైరీ నిర్వహించారు. ఎంపీవో శ్రీనివాస్ సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ వాంగ్మూలం నమోదు చేసుకుంటుండగా సర్పంచ్​ రమేశ్​ వార్డు మెంబర్​ సావిత్రిని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో  ఆమె ఆవేశంతో రమేశ్​ గల్లాపట్టుకుని నిలదీసింది.  

సావిత్రి గతంలో ఉపసర్పంచ్​ గా పనిచేసింది. ఆ టైంలో వారి మధ్య ఉన్న  ఇదే తరహా వివాదంతో రమేశ్​ ఆమెను తిట్టినట్టు తెలిసింది.  కాగా, ఇద్దరిని సముదాయించి ఎంపీవో ఎంక్వైరీ పూర్తి చేశారు.  ఫిబ్రవరి, మార్చి నెలలో రూ.81వేలు, 95వేలు రెండు చెక్కులు  సర్పంచ్​ రమేశ్​, ఉపసర్పంచ్​ పీర్యా సంతకాన్ని ఫోర్జరీ చేసి  డ్రా చేశారని తేలిందని, ఈ విషయాన్ని పై ఆఫీసర్లకు రిపోర్ట్​ పంపిస్తానని వెళ్లిపోయారు.  అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్​ వర్గీయులు జీపీ ఆఫీస్​ బయట ఒకరినొకరు దూషించుకుంటూ కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు.