మంత్రి మల్లారెడ్డి నుండి ప్రాణహాని ఉందంటున్న ఓ మహిళ

మంత్రి మల్లారెడ్డి నుండి ప్రాణహాని ఉందంటున్న ఓ మహిళ

మంత్రి మల్లారెడ్డి నుండి ప్రాణహాని ఉందంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది ఓ మహిళ. సూరారంలో మల్లారెడ్డి హాస్పిటల్స్ మధ్యలో ఉన్న తన ఎకరా 33 గుంటల భూమిని కబ్జా చేసేందుకు మంత్రి యత్నిస్తున్నారని ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ పి.శ్యామల దేవి. స్థానిక అధికారులు కూడా మంత్రికి మద్దతిస్తున్నారని తెలిపింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా తనకు న్యాయం జరగలేదంటూ చెప్పింది మహిళ. మంత్రి తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని రక్షణ కల్పించాలని కోరింది మహిళ.

see more news

మంత్రి పువ్వాడ కాన్వాయ్ కు ప్రమాదం

మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు