- కూకట్ పల్లి చెరువులో పడి అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి
కూకట్పల్లి, వెలుగు : చెరువులో పడి అనుమానాస్పద స్థితితో ఓ యువకుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక ఆత్మహత్యనా..? ఇంకేదైనా కారణం ఉందా..? అనేది తెలియరాలేదు. పోలీసులు తెలిపిన ప్రకారం.. కూకట్పల్లిలో ఉండే జానపాటి బాష(28) హెచ్ఎంటీ శాతవాహననగర్లో వాచ్మెన్. గురువారం అర్ధరాత్రి 12.20 గంటల సమయంలో మెడికల్షాపుకి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు.
ఎంతకీ తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం కూకట్పల్లి భీమునికుంటలో బాష డెడ్ బాడీ తేలింది. పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకున్న పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే మృతికి అసలు కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.