రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి రాపిడోలో జాబ్ చేస్తున్నాడు. నానక్ రాం గూడ నుంచి మణికొండ వైపునకు ప్యాసింజర్ (కస్టమర్)ను తీసుకెళ్తున్న సమయంలో.. ఖాజాగూడ దగ్గర వాహనాన్ని యూటర్న్ తీసుకుంటుండగా.. వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. దీంతో రిజ్వాన్ కింద పడడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రిజ్వాన్ అక్కడికక్కడే మృతిచెందాడు.

కస్టమర్ శ్రీనివాస్ ను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.