మిర్యాలగూడ, వెలుగు : ఓ కేసు విషయమై ప్రకాశం జిల్లా కందుకూరు పోలీసుల అదుపులో ఉన్న ఓ యువకుడు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం వద్ద మంగళవారం లారీ కిందకు దూకి సూసైడ్ కు యత్నించాడు. గాయాలైన అతడిని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరు పోలీసులు ఓ మైనర్ బాలిక మిస్సింగ్ కేసుపై అందిన ఫిర్యాదు మేరకు …కందుకూరు పట్టణానికి చెందిన పేరం వెంకట్రావు(28) అనే యువకుడిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.
విచారణ కోసం కారులో పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న ఈ క్రమంలో మంగళవారం రాత్రి కొత్తగూడెం వద్దకు రాగానే వాంతులు వస్తున్నాయని కారు దిగిన ఆ యువకుడు.. లారీ కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రగాయాలైన వెంకట్రావును ట్రీట్ మెంట్ కోసం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు. అయితే బుధవారం ఉదయం అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.