కల్లు కాంపౌడ్ లో యువకుడి హత్య ..మృతుడు ర్యాపిడో డ్రైవర్

కల్లు కాంపౌడ్ లో యువకుడి హత్య ..మృతుడు ర్యాపిడో డ్రైవర్

చందానగర్, వెలుగు: కల్లు కాంపౌండ్ వద్ద జరిగిన గొడవలో ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు విచక్షణా రహితంగా కొట్టి చంపిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన మాసాన్​పల్లి రామచందర్, పసుపు అమరేశ్​(23) నగరానికి వలస వచ్చి లింగంపల్లిలో ర్యాపిడో నడుపుకుంటున్నారు. రాత్రివేళలో లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్​ఫాంపై పడుకుంటూ పనులు చేసుకుంటున్నారు.

 మంగళవారం రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలోని కల్లు కాంపౌండ్ కు వెళ్లారు. అక్కడే ఉన్న ఓ మహిళ అమరేశ్​తో గొడవ పడ్డది. పక్కనే ఉన్న మరో మహిళ ఇద్దరు వ్యక్తులకు అక్కడికి పిలిపించింది. వెంటనే ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి అమరేశ్​పై దాడి చేయగా స్పృహ తప్పి పడిపోయాడు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. నిందితులు చందానగర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.