‘సదర్మాట్’లో పడి యువకుడు మృతి

‘సదర్మాట్’లో పడి యువకుడు మృతి

ఖానాపూర్, వెలుగు: జగిత్యాల జిల్లాలోని సదర్మాట్ రిజర్వాయర్​లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని ముస్లింపురా కాలనీకి చెందిన ఐదుగురు యువకులు సోమవారం ఖానాపూర్ మండలం మేడంపల్లి శివారులోని సదర్మాట్ ఆనకట్ట వద్దకు వెళ్లారు. అందరూ కెనాల్​లో స్నానానికి దిగగా షేక్ రేహాన్(17) అనే యువకుడు అక్కడి ఫ్లడ్ గేట్​తూములో ఇరుక్కుపోయాడు. తోటి యువకులు సులేమాన్, ఇమ్రాన్, అజీమ్, ముల్తాన్ కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రేహాన్ ​ఊపిరాడక చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు,ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని రేహాన్ డెడ్​బాడీని బయటకు తీశారు. 

ALSO READ :గద్వాల మీటింగ్ రద్దు..ఢిల్లీలోనే చేరికలు

వెల్దిలో టబ్బులో పడి బాలుడు.. 

రఘునాథపల్లి: జనగామ జిల్లాలో టబ్బులో పడి 11 నెలల బాలుడు చనిపోయాడు.  రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన ఎక్కలదేవి గీత, లక్ష్మణ్​కు ఇద్దరు కొడుకులు. చిన్నకొడుకు హేమంత్(11 నెలలు)కు సోమవారం సాయంత్రం తల్లి గీత స్నానం చేయించేందుకు నీటి టబ్బు దగ్గరకు తీసుకెళ్లింది. పిల్లాడిని అక్కడ వదిలి టవల్ కోసం ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి బాలుడు టబ్బులో పడి ఉన్నాడు. బయటకు తీసి డాక్టర్ ​వద్దకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని తెలిపాడు.