కీసర, వెలుగు: చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర మల్లికార్జున నగర్కాలనీకి చెందిన జశ్వంత్రెడ్డి బీటెక్చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం కీసర ఎస్సీ కాలనీ పక్కనున్న తన పొలానికి బైక్ పై వెళ్తున్నాడు. ఆ టైంలో కొందరు పతంగులు ఎగురవేస్తున్నారు. ఒక పతంగికి ఉన్న చైనా మాంజా జశ్వంత్ మెడకు చుట్టుకుంది. దాన్ని గమనించకుండా కొంచం దూరం ముందుకు పోవడంతో మెడను పావు శాతం కోసేసింది. దీంతో బైక్ పై నుంచి పడిపోయిన జశ్వంత్ను స్థానికులు హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు 19 కుట్లు వేసి ట్రీట్మెంట్ చేశారు. బాధితుడి తండ్రి సుధాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు తెలిపారు.
