
- సీఎంను కోరిన విప్ఆది శ్రీనివాస్
వేములవాడ రూరల్, వెలుగు:వేములవాడ సమీపంలోని మర్రిపల్లిలో ఆధునిక వసతులతో గోశాల నిర్మించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. సీఎం రేవంత్రెడ్డిని కోరారు. మంగళవారం సీఎం రేవంత్రెడ్డి సెక్రటేరియెట్లో కలిసిన ఆయన.. రాజన్న గోశాల నిర్మాణానికి 40 ఎకరాలు గుర్తించినట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గోశాల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, వైద్య సిబ్బందిని నియమించాలని కోరారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్ఠాకూర్ ఉన్నారు.