Censor Issue: ఆమిర్‌ఖాన్‌ సినిమాకు సెన్సార్ కష్టాలు.. సర్టిఫికెట్ పెండింగ్‌లో ఉంచిన బోర్డు.. ఏమైందంటే?

Censor Issue: ఆమిర్‌ఖాన్‌ సినిమాకు సెన్సార్ కష్టాలు.. సర్టిఫికెట్ పెండింగ్‌లో ఉంచిన బోర్డు.. ఏమైందంటే?

ఆమిర్ ఖాన్‌‌‌‌ లీడ్ రోల్‌‌‌‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌’.‘సబ్‌‌‌‌ కా అప్న అప్న నార్మల్‌‌‌‌’అనేది ఉపశీర్షిక. ఆమిర్‌‌‌‌‌‌‌‌కు జంటగా జెనీలియా నటిస్తుండగా ఆర్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌.ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నాడు.  ఆమిర్‌‌‌‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై ఆమిర్‌‌‌‌ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మిస్తున్నారు. దివ్య నిధి శర్మ కథను అందించారు. 

‘సితారే జమీన్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌’మూవీ విడుదలకి సిద్దమైంది. జూన్‌ 20న ‘ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలోనే  'సీతారే జమీన్ పర్' సెన్సార్ బోర్డుతో ఇబ్బందుల్లో పడింది. ఈ చిత్రంలో "రెండు కట్స్" చేయమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నిర్మాతలను కోరింది. కానీ, హీరో కం నిర్మాత ఆమిర్‌ అంగీకరించకపోవడంతో.. మూవీకి సర్టిఫికెట్‌ రాలేదని సమాచారం.

ALSO READ | OTT Thriller: ఓటీటీలోకి వార్‌‌‌‌ డ్రామా.. ఉగ్రవాదులను మట్టుబెట్టే యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ వివరాలివే

అయితే, ఇవాళ లేదా రేపు.. ఈ విషయంపై సెన్సార్ బోర్డు బృందంతో ఆమిర్‌ చర్చలు జరపనున్నారని బాలీవుడ్ సినీ వర్గాల టాక్. ఆమిర్ CBFC ఎగ్జామినింగ్ కమిటీని కలుస్తారని కూడా తెలిసింది. ఆమిర్‌ఖాన్‌ తన అభిప్రాయాన్ని కమిటీ ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నాడు

ఒకవేళ కమిటీ కూడా రిజెక్ట్ చేస్తే.. బోర్డు సూచించిన వాటికి అమిర్ ఒప్పుకునే అవకాశముందని బాలీవుడ్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ ‘సితారే జమీన్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌’కు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన వెంటనే.. టికెట్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయనున్నారు. నిబంధనల ప్రకారం, సెన్సార్ సర్టిఫికేట్ లేకుండా సినిమా థియేటర్లు టిక్కెట్లను అమ్మకూడదు.

ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్ బాస్కెట్‌బాల్‌ కోచ్‌ అయిన గుల్షన్‌ పాత్రలో నటించారు. మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న (ఆటిజం ఉన్న పిల్లల) బృందాన్నీ ప్లేయర్స్‌గా ఎలా తీర్చిదిద్దారనే కథాంశంతో మూవీ రూపొందింది.

బాస్కెట్‌బాల్‌ కోచ్‌ అయిన గుల్షన్‌ కు కోపం, ప్రస్టేషన్, దురుసుతనం, సీనియర్స్‌‌‌‌తో గొడవపడటం వంటి అలవాట్లు ఉంటవి. అలాంటి ఓ వ్యక్తి మానసికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న వాళ్లను బాస్కెట్ బాల్‌‌‌‌ ప్లేయర్స్‌‌‌‌గా ఎలా తీర్చిదిద్దాడు, తనను తాను ఎలా మార్చుకున్నాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి అనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్‌‌‌‌.

2007లో వచ్చిన ‘తారే జమీన్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌’కి ఇది సీక్వెల్. ఎమోషనల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌ అయినప్పటికీ వీలయినంత ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. ఆరోష్‌‌‌‌ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్‌‌‌‌ దేశాయ్, వేదాంత్‌‌‌‌ శర్మ, ఆయుష్‌‌‌‌ భన్సాలీ, ఆశిష్‌‌‌‌ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌‌‌‌జైన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ కీలక పాత్రలు పోషించారు.