OTT Thriller: ఓటీటీలోకి వార్‌‌‌‌ డ్రామా.. ఉగ్రవాదులను మట్టుబెట్టే యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ వివరాలివే

OTT Thriller: ఓటీటీలోకి వార్‌‌‌‌ డ్రామా.. ఉగ్రవాదులను మట్టుబెట్టే యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ వివరాలివే

ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన రీసెంట్ మూవీ ‘గ్రౌండ్‌‌ జీరో’. ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజై ప్రశంసలు దక్కించుకుంది. తేజస్ విజయ్ డియోస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కాశ్మీర్ నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రంలో BSF(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) డిప్యూటీ కమాండెంట్ నరేంద్ర నాథ్ దూబే పాత్రలో ఇమ్రాన్‌‌ హష్మీ నటించాడు. ఇపుడీ ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా ఓటీటీలోకి రానుంది. 

‘గ్రౌండ్‌‌ జీరో’ ఓటీటీ:

ఇటీవలే ‘గ్రౌండ్‌‌ జీరో’ మూవీ రెంటల్ విధానంలో ప్రైమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇపుడు జూన్ 20 నుంచి ప్రైమ్ వీడియోలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇక ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లు జూన్ 20 నుంచి ఎటువంటి రెంట్ లేకుండా సినిమా చూడొచ్చు. ఈ మూవీకి జాన్ స్టీవర్ట్ ఇడూరి, తనిష్క్ బాగ్చీ, రోహన్, సన్నీ ఇందర్ ఇచ్చిన మ్యూజిక్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. 

‘గ్రౌండ్‌‌ జీరో’ కథ:

భారతదేశం నుండి కాశ్మీర్ ను విడదీయాలని పాకిస్తాన్‌‌కు సంబంధించిన ఉగ్రవాద సంస్థలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ల కుట్రలను ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతోంది. ఈ సినిమాలోని నేపథ్యం కూడా అదే. 2001లో మన పార్లమెంట్‌‌పై అటాక్‌‌ తర్వాత కాశ్మీర్‌‌‌‌లోని టెర్రరిస్టులను మట్టుపెట్టడానికి BSFఎలాంటి చర్యలు చేపట్టింది.

ALSO READ | మారుతి ‘రాజాసాబ్‌’ విశేషాలు: పిచ్చేక్కించే డ్యాన్స్‌ నంబర్‌.. ముగ్గురు హీరోయిన్స్‌తో ప్రభాస్ చిందులు

పార్లమెంట్ దాడి ప్రధాన సూత్రధారి  జైష్-ఈ-మహమ్మద్ ఉగ్రవాది ఘాజీ బాబాను BSFజవాన్లు ఎలా హతమార్చారనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్‌‌. ఉద్రిక్తత, భావోద్వేగం మరియు దేశభక్తిని మిళితం చేసే ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో డైెరెక్టర్ తేజస్ గ్రిప్పింగ్‍గా తెరకెక్కించారు. 

రితేష్ సిధ్వానీ,  ఫర్హాన్ అక్తర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ తెలుగు సినిమాలు కూడా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో పాటు అడివి శేష్‌‌ ‘గూఢచారి 2’లోనూ ఇమ్రాన్ కీలకపాత్రలు పోషిస్తున్నాడు.