స్పీకర్ను తిట్టడం ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యం చేయడమే: ఆలిండియా దళిత సేన

స్పీకర్ను తిట్టడం ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యం చేయడమే: ఆలిండియా దళిత సేన

పంజాగుట్ట, వెలుగు: స్పీకర్​ను అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్​కుమార్​రెడ్డిని చట్టపరంగా శిక్షించడంతో పాటు శాసన మండలి నుంచి శాశ్వతంగా బర్తరఫ్​ చేయాలని ఆలిండియా దళిత సేన జాతీయ చైర్మెన్​ జేబీ రాజు డిమాండ్​ చేశారు. 

బుధవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్​పర్సన్​ డాక్టర్​ జీవీ వెన్నెల గద్దర్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. దళితులు ఏ స్థాయిలో ఉన్నా జీర్ణించుకోలేక అగ్రవర్ణాల వారు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరైంది కాదన్నారు.

స్పీకర్​ను దూషించడమంటే ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని విమర్శించారు. బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ నిందితులపై పార్టీ పరంగా చర్యలు తీసుకొని దళిత సమాజం దృష్టిలో నిర్దోషిగా నిరూపించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో నిరంకుశ దొరల పాలన సాగదని, ఇక నుంచి దళిత నాయకులను దూషిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

వెన్నెల గద్దర్​ మాట్లాడుతూ బీఆర్ఎస్​ కులతత్వాన్ని పోషిస్తూ, ఇటువంటి నాయకులను ప్రోత్సహించడం వల్లే సమాజంలో తారతామ్యాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. బీఆర్ఎస్​ నాయకులు ఉద్దేశపూర్వకంగా శాసన సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దయానంద్, జాగిరాల సుజ్జీ, సీఎల్​ యాదన్న, సీఎల్​ యాదగిరి, ఐలయ్య, ఇక్బాల్, జంగన్న ముదిరాజ్, సత్యనారాయణ, రిటైర్డ్​ ఇజనీర్​ చిత్రారామన్  పాల్గొన్నారు.