యాదాద్రి, వెలుగు: చదువు మధ్యలో ఆపేసిన వాళ్లు ఈ నెల 15 వరకూ ఓపెన్ స్కూల్లో చేరాలని రాష్ట్ర కో ఆర్డినేటర్ అరుంధతి, డీఆర్డీవో నాగిరెడ్డి సూచించారు. బుధవారం ఓపెన్ స్కూల్స్లో స్డూడెంట్స్జాయినింగ్స్పై రివ్యూ అనంతరం పోస్టర్రిలీజ్ చేసి మాట్లాడారు.
మహిళా సంఘాల్లో క్రియాశీలకంగా ఉంటున్న వాళ్లు చేరాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిన టార్గెట్ రీచ్కావాలని ఆదేశించారు.
ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు పెంచడానికి విద్యాశాఖ, ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ ఆఫీసర్ బీ సురేశ్ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ పెసరు లింగారెడ్డి, కరుణ శ్రీ ఉన్నారు.
