యాదాద్రి జిల్లాలోని హోటల్స్లో 93 కిలోల కుళ్లిన మాంసం ధ్వంసం

యాదాద్రి జిల్లాలోని హోటల్స్లో 93 కిలోల కుళ్లిన మాంసం ధ్వంసం

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో రెండు హోటల్స్​పై ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. కుళ్లిన మాంసం సహా కూరగాయలను ధ్వంసం చేసి, హోటల్స్​ను సీజ్​ చేశారు. 

భువనగిరి బైపాస్​ రోడ్​లోని చాచా దాబాపై తొలుత ఫుడ్​ సేఫ్టీ కంట్రోలర్​ జ్యోతిర్మయి, డిజిగ్నేటెడ్​ ఆఫీసర్​ స్వాతి, ఆఫీసర్​ శివశంకర్​ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఫ్రిజ్​ను తనిఖీ చేయగా అందులో నిల్వ చేసిన 83 కిలోల మాంసం ఉన్నట్టు గుర్తించారు.

తినలేని విధంగా ఈ మాంసాన్ని సింథటిక్​ కలర్స్​ ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేసి వినియోగిస్తున్నారని గుర్తించారు. మాంసం సహా కూరగాయలను ధ్వంసం చేసి హోటల్ లైసెన్స్​ను క్యాన్సిల్​ చేసి సీజ్​ చేశారు.

అనంతరం మల్కాపూర్​లోని సంగం హోటల్​పై దాడులు నిర్వహించి 10 కిలోల కుళ్లిన మాంసంతో పలురకాల ఉత్పత్తులు వంట చేసినట్టు గుర్తించారు. మాంసంతో పాటు 5 కిలోల కూరగాయలు, 30 కిలోల గ్రేవీలు, 10 కిలోల టీ పొడిని ధ్వసం చేశారు. హోటల్​కు నోటీసులు జారీ చేశారు.