ఖైరతాబాద్, వెలుగు: విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న తమ లీడర్లపై పోలీసుల లాఠీచార్జ్ను నిరసిస్తూ మంగళవారం రాష్ర్టంలో స్కూల్స్ బంద్కు ఏబీవీపీ పిలుపు నిచ్చింది. సోమవారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో ఏబీవీపీ నేతలు మాట్లాడారు. విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలంటూ 2న నాంపల్లిలోని ఎడ్యుకేషన్ బోర్డ్ వద్ద నిరసన తెలిపిన తమ లీడర్లపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులతో తమ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించలేద న్నారు. రాష్ట్ర సర్కార్ కుట్ర పూరితంగా కేసులు పెట్టి వేధిస్తోందని, అరెస్టు చేసిన తమ లీడర్లను విడుదల చేయాలన్నారు. స్కూల్స్ ప్రారంభమై నెలవుతున్నా బుక్స్ పంపిణీ జరగలేదన్నారు. ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఝాన్సీ, లీడర్లు శ్రీశైలం, కమల్ సురేష్, అరవింద్, సిరి వెన్నెల పాల్గొన్నారు.