సందేశ్​ఖలి నిందితులను ఉరి తీయాలని ఏబీవీపీ డిమాండ్

సందేశ్​ఖలి నిందితులను ఉరి తీయాలని ఏబీవీపీ డిమాండ్

డిచ్​పల్లి, వెలుగు: పశ్చిమ్​బెంగాల్​లోని సందేశ్​ఖలిలో జరిగిన ఘటనకు కారణమైన నిందితులను ఉరితీయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ డిమాండ్​ చేశారు. టీఎంసీ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ మంగళవారం క్యాంపస్​లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీఎంసీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగాల్​లో అధికార టీఎంసీ పార్టీ అండతో ఒక వర్గానికి చెందిన మహిళలను టార్గెట్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సీఎం ఉన్నచోట ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు ఉద్యమాలు చేస్తామన్నారు. వర్సిటీ ప్రెసిడెంట్​ సాయి, సెక్రెటరీ అమృత్​చారి, లీడర్లు రాకేశ్, హరికృష్ణ, ప్రమోద్, నాగరాజ్, సమీర్​పాల్గొన్నారు.