
హైదరాబాద్సిటీ, వెలుగు: సికింద్రాబాద్, హైదరాబాద్నుంచి కర్నాటకలోకి అర్సికెరెకు, కాచిగూడ నుంచి తిరుపతికి స్పెషల్రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ప్రకటించారు. 07079 నంబర్ ట్రైన్ సికింద్రాబాద్నుంచి ఆర్సికెరెకు ప్రతి ఆదివారం (జులై 06) ఉదయం 6.05 గంటలకు ఉంటుంది. ఈ నెల 13 నుంచి ఆగస్టు 31 వరకు నడువనుంది.
అర్సికెరె – సికింద్రాబాద్(07080) ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉండగా.. ఈ నెల 14 నుంచి సెప్టెంబరు 1 వరకు నడుస్తుంది. హైదరాబాద్– అర్సికెరె(070769) ప్రతి మంగళవారం ఉదయం 7.20 గంటలకు ఉంటుంది. ఈ నెల 8 నుంచి ఆగస్టు 26 వరకు నడుస్తుంది. అర్సికెరె – హైదరాబాద్(07070 ) ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉండగా, ఈ నెల 9 నుంచి ఆగస్టు 27 వరకు నడుస్తుంది.
కాచిగూడ – తిరుపతి(07676) ప్రతి మంగళవారం 11.30 గంటలకు ఉంటుంది. ఈ రైలు జడ్చర్ల మీదుగా కడప ద్వారా రేణిగుంట చేరుతుంది. ఇందులో అన్ని 3ఏసీ కోచ్లే ఉంటాయి.