ఫైల్ కదలాలంటే రూ. 20 వేలు..ఏసీబీకి చిక్కిన స్కూల్ రికార్డు అసిస్టెంట్

ఫైల్ కదలాలంటే రూ. 20 వేలు..ఏసీబీకి చిక్కిన స్కూల్ రికార్డు అసిస్టెంట్

పంజాగుట్ట, వెలుగు: సర్వీస్​రికార్డులను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ. 20 వేల లంచం డిమాండ్ చేసి, ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. అమీర్​పేట ప్రభుత్వ పాఠశాలలో గతంలో పనిచేసిన ఓ మహిళ ఉద్యోగి సర్వీస్ రికార్డులను డిప్యూటీ ఇన్​స్పెక్టర్ ఆఫ్​స్కూల్స్​కార్యాలయానికి పంపాల్సి ఉంది. ఈ పని కోసం ఆమె కొడుకు రాగా, అక్కడ రికార్డు అసిస్టెంట్​గా పనిచేస్తున్న సీహెచ్. శివానంద్ అందుకు రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు.

లంచం ఇవ్వడం ఇష్టం లేని అతను ఏసీబీని ఆశ్రయించగా, అధికారులు పక్కా స్కెచ్ వేశారు. సోమవారం సాయంత్రం స్కూల్ సమీపంలోని ఓ జ్యూస్​ సెంటర్​లో బాధితుడి నుంచి శివానంద్ లంచం డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు.