
అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట పట్టణంలోని బీసీ బాయ్స్ హాస్టల్ లో ఏసీబీ, వివిధ శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ లోని 18 రకాల రిజిస్టర్లను పరిశీలించారు. 9 శాఖలకు చెందిన అధికారులు తనిఖీలు చేపట్టారు. హాస్టల్ పరిసరాల పరిశుభ్రత, కూరగాయలు, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు.
మెనూ పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని, పరిశుభ్రత పాటించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ ఆదేశించారు. రికార్డులను పరిశీలించి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. వివిధ శాఖల అధికారులు ప్రవీణ్ కుమార్, వజ్ర కుమార్ రెడ్డి పాల్గొన్నారు.