రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ పై ఏసీబీ దాడులు..

రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ పై ఏసీబీ దాడులు..

రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ పై దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు.హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా పని చేస్తున్న శ్రీనివాస్  పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు అధికారులు.

మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లు ఏడీ శ్రీనివాస్ కు చెందినట్లు కూడా గుర్తించారు అధికారులు.పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసుతో పాటు రాయదుర్గంలోని మై హోం భూజా లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శ్రీనివాస్ పై సోదాలు చేపట్టారు. మూడు బృందాలుగా తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.