హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. మూసాపేట్, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో డాక్యుమెంట్స్ రైటర్స్ లేనిదే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగట్లదవే వరుస ఫిర్యాదుల నేపథ్యంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనీఖీలు నిర్వహించినట్టు తెలిపారు హైదరాబాద్ ఏసిబి డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి..
ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్ లకు బలం చేకూరే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనీఖీలు చేసే సమయంలో 15మందికి పైగా డాక్యుమెంట్ రైటర్స్ ఆఫీస్ లోనే స్లాట్ బుకింగ్ కన్నా పదుల లంఖ్యలో ఎక్కువ డాక్యుమెంట్స్ తో ఉండడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఒక డాక్యుమెంట్ రైటర్ వద్ద దొరికిన 10వేల రుపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నామని,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్స్ ఉండడంపై జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామన్నారు.
