గవర్నర్ ప్రసంగంలో రాజధాని ప్రస్తావనేది?

గవర్నర్ ప్రసంగంలో రాజధాని ప్రస్తావనేది?

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగం ఆయన సొంత ప్రసంగం కాదన్నారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చన్నాయుడు. గవర్నర్ ప్రసంగం కేవలం నవరత్నాలకు పరిమితమైందని, ప్రసంగంలో నవరత్నాల గురించి తప్ప మరో విషయమేమీ లేదన్నారు.

కొత్త ప్రభుత్వం తరపున గవర్నర్ నరసింహన్  చేసిన మొదటి ప్రసంగంలో చాలా అంశాలపై స్పష్టత లేదని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం గురించి ఒక్క చోట కూడా ప్రస్తావించలేదన్నారు. ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం, సంక్షేమం వంటి విషయాల్లో ఏమి చేస్తారో తెలియదని అచ్చెన్నాయుడు అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని గురించి ప్రస్తావించకపోవడ బాధాకరమన్నారు.

139 బీసీ కులాల్లో కేవలం నాలుగు కులాల గురించే ప్రస్తావించారని, చేతి వృత్తులు, కుల వృత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదని అన్నారు. సరైన సమయంలో తెలుగుదేశం పార్టీ ఈ విషయాలను నిలదీస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు.