డ్రంకెన్ డ్రైవ్​లో దొరికితే జైలుకే

డ్రంకెన్ డ్రైవ్​లో దొరికితే జైలుకే

గండిపేట, వెలుగు: డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని  రాజేంద్రనగర్‌ ట్రాఫిక్ ఏసీపీ మురళీకృష్ణ హెచ్చరించారు. ఆదివారం రాజేంద్రనగర్ ట్రాఫిక్ సీఐ బోసుబాబు ఆధ్వర్యంలో కిస్మత్ పురా రోడ్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మురళీ కృష్ణ మాట్లాడుతూ.. మెయిన్ రోడ్లతో పాటు గల్లీల్లోనూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామన్నారు. తాగి వెహికల్ నడిపి పట్టుబడ్డ వారికి బీఏసీ లెవెల్ ఆధారంగా కోర్టులు జరిమానా, జైలు శిక్ష విధిస్తాయన్నారు. మైనర్లకు బండ్లు ఇచ్చిన వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.