
14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
కొనసాగిన అధికారుల సోదాలు
ఓ మహిళ పేరిట ఉన్న 4 ఎకరాల ల్యాండ్ డాక్యుమెంట్లు సీజ్
అనంతపురంలో మరో 100 ఎకరాల భూమి
హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అక్రమాస్తుల కేసులో బుధవారం ఆయన్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. గురువారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. వైద్య పరీ క్షలు చేసిన తర్వాత మణికొండలోని జడ్జి ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం వరకు జడ్జి విచారణ చేశారు. తర్వాత జడ్జి ఆదేశాలతో అధికారులు నర్సింహారెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు.
మరిన్ని ఆస్తులు గుర్తింపు
బుధవారం తెలంగాణ, ఏపీల్లో 25 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. గురువారం కూడా తనిఖీలు కొనసాగించారు. కొండాపూర్లోని అసైన్డ్ భూములతో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు గుర్తించారు. మహేంద్రహిల్స్లోని బ్యాంక్ లాకర్ను ఓపెన్ చేసి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్లోని ఓ మహిళ పేరిట కొనుగోలు చేసిన 4 ఎకరాల ల్యాండ్ డాక్యుమెంట్లను గుర్తించి వాటిని సీజ్చేశారు. అనంతపురంలో మరో 100 ఎకరాల ల్యాండ్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, పనిచేసిన పోలీస్స్టేషన్స్ నుంచే నర్సింహారెడ్డి నెట్వర్క్ పెంచుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రియల్ఎస్టేట్ వ్యాపారంతో పాటు బినామీ పేర్లతో హోటళ్లు, బార్లను నడుపుతున్నట్టు ఆధారాలు సేకరించారు. డిపార్ట్మెంట్లో పలుకుబడిని ఉపయోగించి శివారు ప్రాంతాలైన రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పోస్టింగ్స్ తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.
For More News..