త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న.. మరో హీరో,హీరోయిన్ ..ఎవరంటే?

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న.. మరో హీరో,హీరోయిన్ ..ఎవరంటే?

లేటెస్ట్  పోర్ థోజిల్(Por Thozhil)  క్రైమ్ థ్రిల్లర్ మూవీతో తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్(Ashok Selvan) హిట్ ట్రాక్ లో వచ్చారు. అశోక్ సెల్వన్ తెలుగు,తమిళంలో మంచి గుర్తింపున్న యాక్టర్. ఇక తాజాగా అశోక్ సెల్వన్  త్వరలో మ్యారేజ్ చేసుకుంటాడని సమాచారం.

హీరోయిన్ కీర్తి పాండియన్‌(Keerthi Pandian) ను తో లవ్ ఉన్నాడని, త్వరలో వీరిద్దరి మ్యారేజ్ జరగబోతుందని తెలుస్తోంది.  అశోక్,కీర్తి సెప్టెంబర్ 13న వివాహం చేసుకోనున్నారు. వివాహం తిరునెల్వేలి లో వారి సంప్రదాయ పద్ధతిలో..కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది.

అశోక్ సెల్వన్ పిజ్జా 2, భద్రమ్ లాంటి డబ్బింగ్ మూవీస్ తో తెలుగులో ఆకట్టుకున్నారు. కాన్సెప్ట్ పరంగా హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీస్ అశోక్ మాత్రం పెద్దగా గుర్తింపు అందుకోలేకపోయారు. అయితే 2020లో వచ్చిన ఓ మై కడవులే హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస మూవీస్ తో దూసుకెళ్తున్నారు.

ఇక  కోలీవుడ్‌లో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ  యువ జంట అశోక్, కీర్తి మ్యారేజ్ కు సంబంధించి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ప్రస్తుతానికి గాసిప్ లా వస్తోన్న ఈ మౌత్ టాక్ వైరల్ గా మారింది. 

హీరోయిన్ కీర్తి పాండియన్‌ ఫేమస్ తమిళ యాక్టర్, ప్రొడ్యూసర్ అరుణ్ పాండియన్ చిన్న కూతురు. అశోక్, కీర్తి జంటగా కబాలి ఫేమ్ పా రంజిత్ నిర్మిస్తున్న బ్లూ స్టార్ అనే చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్‌ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెల్వన్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ లో ఆక్ట్ చేశారు. 

ఇక అతని చిత్రం ఓ మై కడవులే తెలుగులో ఓరి దేవుడాగా రీమేక్ చేయబడింది, విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో కీ రోల్ నటించారు అశోక్ సెల్వన్.