యువతి ఆత్మహత్య కేసులో..పుష్ప ఫేమ్ జగదీశ్​ అరెస్ట్

యువతి ఆత్మహత్య కేసులో..పుష్ప ఫేమ్ జగదీశ్​ అరెస్ట్

పంజాగుట్ట, వెలుగు :  ఓ యువతి  ఆత్మహత్య కేసులో  సినీ నటుడు, పుష్ప ఫేమ్ జగదీశ్​( మచ్చ)ను హైదరాబాద్​పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కాకినాడకు చెందిన శ్రేష్ట(31) షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీసులు తీస్తూ..  సంగీత నగర్ లోని రేఖ డీలక్స్ అపార్ట్​మెంట్​లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో వరంగల్ కు చెందిన జగదీశ్​తో పరిచయం ఏర్పడింది. ఆమెకు వివాహమై భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఒంటరిగా ఉంటున్న శ్రేష్ట, జగదీశ్​మధ్య సాన్నిహిత్యం ఏర్పడి  రిలేషన్ షిప్ లో ఉన్నారు. 

శ్రేష్టతో  సంబంధం కొనసాగిస్తూనే ఆమెకు చెప్పకుండా జగదీశ్​ఇటీవల మరో అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. అది తెలిసిన శ్రేష్ట.. జగదీశ్​ను దూరం పెట్టింది. నెల్లూరుకు చెందిన దినేష్ కు దగ్గర అయింది. అయితే, వారిద్దరూ ఏకాంతంగా ఉన్న  సమయంలో జగదీశ్​వచ్చి వారి ఫొటోలు తీశాడు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం వారిద్దరి ఫొటోలు తీసినట్టు జగదీశ్​ బెదిరించాడు. 

ఓ ఫొటోను  శ్రేష్ట మొబైల్ కి పంపించాడు. దీంతో ఆందోళనకు గురైన శ్రేష్ట.. నవంబర్ 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె  మృతికి జగదీశ్​ కారణం అంటూ ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంక్వైరీ చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు  తరలించారు.