ఘట్ కేసర్ లో రైలు ఢీకొని మహిళ మృతి.. ముక్కలు ముక్కలుగా మృతదేహం

ఘట్ కేసర్ లో  రైలు ఢీకొని మహిళ మృతి.. ముక్కలు ముక్కలుగా మృతదేహం

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.   రైల్వే గేటు దాటుతుండగా రైలు ఢీకొని బాలమణి (58) అనే మహిళ అక్కడికక్కడికే మృతి. చెందింది. రైలు ఢీకొనడంతో  మహిళ ముక్కలు ముక్కలుగా దూరంలో పడిపోయింది. 

 సంఘటన స్థలం దగ్గర  దొరికిన ఆధార్ కార్డు ద్వారా మృతురాలు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ కు చెందిన బాలామణి గా గుర్తించారు పోలీసులు.   కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు  మార్టంకోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 ఘట్ కేసర్ దగ్గరలోనే ఈ రైల్వే గేటును సంవత్సరం నుంచి మూసివేశారు. కేవలం పాదాచారులు నడిచే వీలవవ్వడంత గేటు దాటుతున్నారు. దీంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.