గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిన తమిళ నటుడు

 గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిన తమిళ నటుడు

ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇవాళ ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీనొప్పి రావడంతో స్పృహతప్పి పడిపోయారు. దీంతో అలీఖాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

డెమోక్రటిక్ టైగర్స్ ఆఫ్ ఇండియా పేరుతో పార్టీని నడుపుతున్నప్పటికీ ఎన్నికల సంఘం ఇంకా ఆమోదించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జాక్‌ఫ్రూట్ గుర్తును ఆయనకు కేటాయించారు. కాగా ఇటీవల ఆయన హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.   

కాగా  తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికలు రేపు (ఏప్రిల్ 19) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమి, డీఎంకే కూటమి, బీజేపీ కూటమికి త్రిముఖ పోటీ జరగనుంది. నామ్ తమిళర్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. వీరి మధ్య కొందరు ప్రముఖులు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా బరిలో నిలిచారు.