మెగాస్టార్ అంటే తెలియని సినీప్రేక్షకులుండరు. ఆయన ఎందరో నటులకు ప్రేరణ. స్వయంకృషితో ఒక్కో మెట్టూ ఎక్కుతూ టాలీవుడ్ లో అందనంత స్థాయికి ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22(శనివారం) న జరిగింది.
మెగాస్టార్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచి మిత్రడు. ఇద్దరూ ఇండస్ట్రీలో అగ్రతారలే. అయినా కూడా సినిమా ఫంక్షన్లలో ఎక్కడ కలిసినా అప్యాయంగా మాట్లాడుకుంటారు. ఒకరిమీద మరోకరు జోకులు వేస్తూ నవ్వుకుంటారు. వారిద్దరిది అంత విడదీయరానిబంధం.
తాజాగా చిరూ పుట్టినరోజు సందర్భంగా..మోహన్ బాబు చిరంజీవికి ఒక గిఫ్ట్ పంపించాడు. చెక్కతో తయారుచేసిన ఫుల్లీ పాలిష్డ్ బైక్ చిరూకి గిఫ్ట్ గా పంపించారు. ఆ బైక్ తో ఫొటో దిగిన చిరూ.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
‘నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టినరోజు నాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి… … … Thank you @themohanbabu ? pic.twitter.com/8ROLZ6yfwI
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2020
For More News..