జూబ్లీహిల్స్, వెలుగు: మన్నా మినిస్ట్రీస్ అనే పథకం పేరుతో ఇద్దరు వ్యక్తులు తన వద్ద రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ సినీ, టీవీ నటుడు సాయికిరణ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జాన్ బాబు, లివింగ్ స్టోన్ అనే ఇద్దరు వ్యక్తులు నటుడు సాయికిరణ్ ను పరిచయం చేసుకున్నారు. మన్నా మినిస్ట్రీస్ అనే పథకంలో డబ్బులు పెట్టుబడి పెడితే కొద్ది కాలానికే రూ. 35 లక్షల వస్తాయని నమ్మబలికారు. దీంతో ఆయన వారిద్దరిని నమ్మి రూ.10 లక్షలకు పైగా చెల్లించారు. మోసపోయానని తెలుసుకున్న సాయికిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, జాన్ బాబు, లివింగ్ స్టోన్పై కేసు నమోదు చేశారు.