సోనూసూద్ పన్ను ఎగవేత.. ఐటీ అధికారుల వెల్లడి

సోనూసూద్ పన్ను ఎగవేత.. ఐటీ అధికారుల వెల్లడి

బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ రూ.20కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.  గత మూడు రోజులుగా సోనూసూద్ ఇళ్లల్లో..ఆఫీసుల్లో ఐటీశాఖ సోదాలు నిర్వహించారు.  అలాగే సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టం ఉల్లంఘించి.. విదేశాల్లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.2.1 కోట్లు సేకరించారని గుర్తించారు.. సోనూసూద్ తో పాటు ఆయన సన్నిహితుల ఆఫీసుల్లో ట్యాక్స్ ఎగవేతకు సంబంధించిన సాక్ష్యాలు గుర్తించారు.  కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సోనూసూద్ తన సూద్ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా రూ.18 కోట్లకు పైగా ఫండ్స్ సేకరించి ఇందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు  ఖర్చు పెట్టారని తెలిపింది. మిగతా డబ్బు ఆ ఫౌండేషన్ అకౌంట్లోనే ఉందని చెప్పారు ఐటీ అధికారులు.