
నటుడు సునీల్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గురువారం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేరారు. దీంతో సునీల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ వార్తలపై స్పందించిన సునీల్… తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగా డాక్టర్ల సూచనతో ఆస్పత్రిలో చేరానని ఫ్యాన్స్ ఆందోళన పడొద్దని తెలిపారు. సునీల్ కమేడియన్ గా నటించిన డిస్కో రాజా రేపు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
see also: ‘మంజు చాలామందితో…. అందుకే చంపేశా’