విజయ్ ప్రమాణస్వీకారం.. వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష

విజయ్ ప్రమాణస్వీకారం.. వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం అయ్యింది దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో విజయ్‌కు అభిమానులు, టీవీకే (TVK) కార్యకర్తలు నీరాజనాలు పలికారు. ఆ ప్రాంతమంతా జై విజయ్ నినాదాలతో హోరెత్తిపోతోంది. 

ముఖ్యంగా ఈ వేడుకలో సినీ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన చిరకాల మిత్రుడు, సహనటుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఈ తరుణంలో ఆమె హాజరుకావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. 

విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఏడుగురు టీవీకే పార్టీకి చెందిన వారు కాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మంత్రివర్గంలో ఎస్. కీర్తన ఒక మహిళకు కూడా చోటు దక్కింది.

మంత్రులు వీళ్లే

  • ఎన్. ఆనంద్
  • ఆదవ అర్జున
  • కె.ఎ. సెంగోటియన్
  • ఎస్. కీర్తన
  • కె.జి. అరుణ్ రాజ్
  • పి. వెంకటరమణన్
  • సి.ఆర్. నిర్మల్ కుమార్
  • రాజ్‌మోహన్
  • టి.కె. ప్రభు

  •