హైదరాబాద్: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా మూవీని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 31న లైగర్ గ్లింప్స్ విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళంతోపాటు కన్నడ, హిందీల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పూరి కనెక్ట్స్ తోపాటు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్.. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ ఏకంగా 2022 ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది.
It’s Time.
— Vijay Deverakonda (@TheDeverakonda) December 16, 2021
A long journey culminates in Two very important dates!
Stay Ready..
And Remember the words that have been said. #Liger pic.twitter.com/XZT9irEorb
మరిన్ని వార్తల కోసం: