
సినీ నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: బిగ్బాస్ సీజన్3 నిర్వాహకులపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు నమోదైంది. నటి గాయత్రి గుప్తా ఈ ఫిర్యాదు చేశారు. పలు సినిమాల్లో నటించిన గాయత్రీ గుప్తాను స్టార్ మా టీవీ చానెల్ వాళ్లు బిగ్బాస్3 సెలక్షన్ లో భాగంగా ఇంటర్వూకు పిలిచారు. ఈ ఇంటర్వ్యూలో తనను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఆమె ఆరోపించారు. షోలో పాల్గొనేందుకు అగ్రిమెంట్ సైన్చేశాక కొన్ని రోజులకు తనకు అవకాశం లేదన్నారని చెప్పారు. దీంతో గాయత్రి గుప్తా రెండు రోజులుగా పలు చర్చా వేదికల్లో బిగ్బాస్ నిర్వాహకులపై ఆరోపణలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి యాంకర్ శ్వేతారెడ్డితో కలిసి బిగ్ బాస్ సీజన్ నిర్వాహకులపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.