‘బిగ్​బాస్’ పై మరో కేసు

‘బిగ్​బాస్’ పై మరో కేసు

సినీ నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: బిగ్​బాస్​ సీజన్​3 నిర్వాహకులపై రాయదుర్గం పోలీస్ స్టేషన్​లో మరో ఫిర్యాదు నమోదైంది. నటి గాయత్రి గుప్తా ఈ ఫిర్యాదు చేశారు. పలు సినిమాల్లో నటించిన గాయత్రీ గుప్తాను స్టార్​ మా టీవీ చానెల్ వాళ్లు బిగ్​బాస్​3 సెలక్షన్ లో భాగంగా ఇంటర్వూకు పిలిచారు. ఈ ఇంటర్వ్యూలో తనను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఆమె ఆరోపించారు. షోలో  పాల్గొనేందుకు అగ్రిమెంట్​ సైన్​చేశాక కొన్ని రోజులకు తనకు అవకాశం లేదన్నారని చెప్పారు. దీంతో  గాయత్రి గుప్తా రెండు రోజులుగా పలు చర్చా వేదికల్లో  బిగ్​బాస్ ​ నిర్వాహకులపై  ఆరోపణలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి యాంకర్​ శ్వేతారెడ్డితో కలిసి బిగ్​ బాస్​ సీజన్​ నిర్వాహకులపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.