అదానీ ఎంటర్​ప్రైజస్​ లాభం రూ. 820 కోట్లు

అదానీ ఎంటర్​ప్రైజస్​ లాభం రూ. 820 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ​ఫ్లాగ్​షిప్​ కంపెనీ అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ డిసెంబర్​ 2022 క్వార్టర్లో మంచి లాభం సంపాదించింది. ఈ క్వార్టర్లో కన్సాలిడేటెడ్​ లాభం రూ. 820.06 కోట్లని అదానీ ఎంటర్​ప్రైజస్​ ప్రకటించింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్​ క్వార్టర్లో కంపెనీకి రూ. 11.63 కోట్ల నష్టం వచ్చింది. యూఎస్​ షార్ట్​సెల్లర్​ హిండెన్​బర్గ్​రిపోర్టుతో అదానీ ఎంటర్​ప్రైజస్​ సహా గ్రూప్​లోని లిస్టెడ్​ కంపెనీల షేర్లు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్​ షేర్ల ధరల మానిప్యులేషన్​తోపాటు, ఫైనాన్షియల్​అడ్జస్ట్​మెంట్స్​ చేస్తోందని హిండెన్​బర్గ్​ రిపోర్టు ఆరోపణలు చేసింది. తాజా డిసెంబర్​ క్వార్టర్లో అదానీ ఎంటర్​ప్రైజస్​ రెవెన్యూ 42 శాతం పెరిగి రూ. 26,612.33 కోట్లకు ఎగసింది. ఇంటిగ్రేటెడ్​ రిసోర్స్​ మేనేజ్​మెంట్​ బిజినెస్​ లాభం ఏకంగా 370 శాతం పెరిగి రూ. 669 కోట్లయిందని, మైనింగ్​–న్యూ ఎనర్జీ బిజినెస్​ల లాభం కూడా మూడు రెట్లు పెరిగిందని అదానీ ఎంటర్​ప్రైజస్​ వెల్లడించింది.

ఎయిర్​పోర్టుల బిజినెస్​ రెవెన్యూ డబులైందని, లాభం మాత్రం 29 శాతమే పెరిగిందని పేర్కొంది. మార్కెట్లోని ప్రస్తుత ఓలటాలిటీ (ఒడిదుడుకులు) తాత్కాలికమని రిజల్ట్స్​ సందర్భంగా ఛైర్మన్​ గౌతమ్​ అదానీ చెప్పారు. ఎదగడానికి, లాంగ్​ టర్మ్​ వాల్యూ క్రియేషన్​కు తగిన అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు పేర్కొన్నారు. స్టేక్​హోల్డర్లందరికీ నిలకడగా లాంగ్​టర్మ్​ వాల్యూ క్రియేట్​ చేయాలనేదే ఎప్పుడూ తమ లక్ష్యమని వివరించారు. కోల్​ మైనింగ్​, ఎయిర్​పోర్టులు, డేటా సెంటర్లు, డిజిటల్​ సర్వీసులు, మెటల్స్​ వంటి రంగాలలో అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హిండెన్​బర్గ్​ రిపోర్టు ఆరోపణల నేపథ్యంలో రూ. 20 వేల కోట్ల ఫాలోఆన్​ పబ్లిక్​ ఆఫర్​ (ఎఫ్​పీఓ)ను కంపెనీ విత్​డ్రా చేసుకుంది. ఎఫ్​పీఐకు సబ్​స్క్రయిబ్​ చేసిన ఇన్వెస్టర్లకు వారి సొమ్మును వాపస్​ చేసింది.

రిజల్ట్స్​ తర్వాత షేర్లు ర్యాలీ..  చివర్లో ప్రాఫిట్​ బుకింగ్

డిసెంబర్​ క్వార్టర్లో లాభాల ప్రకటన తర్వాత మంగళవారం సెషన్లో అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ షేర్లు ర్యాలీ చేశాయి. బీఎస్​ఈలో ఈ కంపెనీ షేర్లు 10 శాతం లాభపడ్డాయి. ఇంట్రాడేలో ఒక దశలో అదానీ ఎంటర్​ప్రైజస్​ షేర్లు రూ. 1,889 ని తాకాయి. క్యూ 3 రిజల్ట్స్​ ప్రకటించిన తర్వాతే షేర్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. చివర్లో కొంత ప్రాఫిట్​ బుకింగ్​ వచ్చినా, లాభాల్లోనే ముగిశాయి. అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ షేర్లు బీఎస్​ఈలో 1.91 శాతం లాభంతో రూ. 1,750.30 వద్ద క్లోజయ్యాయి.

ఇండిపెండెంట్ ఆడిటర్​గా గ్రాంట్​ థార్న్​టన్​...

హిండెన్​బర్గ్​ ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అదానీ గ్రూప్​ అన్ని రకాల ప్రయత్నాలనూ చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని గ్రూప్​ కంపెనీల కోసం ఇండిపెండెంట్​ ఆడిటర్​గా ప్రముఖ అకౌంటెన్సీ ఫర్మ్​ గ్రాంట్​ థార్న్​టన్​ను నియమించుకుంది. షేర్ల మానిప్యులేషన్​తోపాటు, ఆఫ్​షోర్​ కంపెనీల ద్వారా ఆర్థిక సర్దుబాట్లు చేస్తోందని హిండెన్​బర్గ్​  ప్రధానంగా ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో, ప్రతిష్టను కాపాడుకోవడానికి అదానీ గ్రూప్ ప్రయత్నాలను తీవ్రం చేస్తోంది. హిండెన్​బర్గ్​ ఆరోపణలతో అదానీ గ్రూప్​ లిస్టెడ్​ కంపెనీలు భారీగానే తమ మార్కెట్​ విలువను పోగొట్టుకున్నాయి. ఫలితంగా ఆసియాలోనే సంపన్నుడిగా తన హోదానూ చైర్మన్​ గౌతమ్​ అదానీ వదులుకోవల్సి వచ్చింది. కార్పొరేట్​ గవర్నెన్స్​ స్టాండర్డ్స్​పై ముఖ్యంగా గ్రాంట్​ థార్న్​టన్​ ఫోకస్​ పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాకపోతే, గ్రాంట్​ థార్న్​టన్​ నియామకంపై  పంపిన ఈ–మెయిల్​కు  అదానీ గ్రూప్​బదులు ఇవ్వలేదు.