ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో అదానీ మేనల్లుడు

ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో అదానీ మేనల్లుడు

న్యూఢిల్లీ: భారతీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మేనల్లుడు ప్రణవ్ అదానీకి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నోటీసు గత సంవత్సరమే జారీ అయింది. 2021లో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ మద్దతు ఉన్న ఎస్​బీ ఎనర్జీ హోల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదానీ గ్రీన్ ఎనర్జీ కొనుగోలు చేసేందుకు సంబంధించిన రహస్య  సమాచారాన్ని ప్రణవ్ అదానీ తన బావమరిది కునాల్ షాకు వెల్లడించారని సెబీ ఆరోపించింది. 

ఈ కేసులో కాల్ రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను,  ట్రేడింగ్ ప్యాటర్న్స్​ను సెబీ విశ్లేషించి నోటీసులు పంపించింది. కునాల్ షా,  ఆయన సోదరుడు నృపాల్ షా తదనంతరం అదానీ గ్రీన్ షేర్లలో ట్రేడింగ్ చేసి రూ. 90 లక్షలకు పైగా లాభం పొందారని సెబీ ఆరోపిస్తోంది.  షా సోదరులు తమ తరఫు న్యాయవాది ద్వారా ఈ ఆరోపణలను ఖండించారు. తాము   రహస్య సమాచారం ఆధారంగా ట్రేడింగ్ చేయలేదని, ఆ సమాచారం అప్పటికే బహిరంగంగా అందుబాటులో ఉందని  పేర్కొన్నారు. అయితే సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.