ప్రణయ్‌‌ రాయ్ షేర్లూ​ కొనేసిన అదానీ

ప్రణయ్‌‌ రాయ్ షేర్లూ​ కొనేసిన అదానీ

న్యూఢిల్లీ: ఎన్‌‌డీటీవీ  ప్రమోటర్లు  ప్రణయ్ రాయ్‌‌, రాధిక రాయ్‌‌ల నుంచి కంపెనీలో 27.26 శాతం వాటాను దక్కించుకున్నామని అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో పేర్కొంది. ప్రస్తుతం ఎన్‌‌డీటీవీలో విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌‌ (ఇన్‌‌డైరెక్ట్ సబ్సిడరీ) కు 8.27 శాతం వాటా ఉండగా, ఈ డీల్‌‌కు ముందు ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పీఆర్‌‌‌‌ లిమిటెడ్‌‌కు 29.18 శాతం వాటా ఉంది. ౌ

తాజాగా కుదుర్చుకున్న డీల్ పూర్తయితే ఎన్‌‌డీటీవీలో ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పీఆర్ వాటా 56.45 శాతానికి పెరుగుతుంది. విశ్వప్రధాన్‌‌ను, ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పీఆర్‌‌‌‌ను అదానీ గ్రూప్‌‌ కంట్రోల్‌‌ చేస్తోంది. షేరు ధర రూ. 342.65 వద్ద  ప్రమోటర్ల  నుంచి వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది.