విజయసాయిరెడ్డీ.. దివాలాకోరువా?.. మోదీ బానిసవా?: అద్దంకి దయాకర్

విజయసాయిరెడ్డీ.. దివాలాకోరువా?.. మోదీ బానిసవా?: అద్దంకి దయాకర్

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. పెద్ద రాజకీయ అజ్ఞాని అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని అన్నారు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా అద్దంకి దయాకర్ స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసు ఎందుకు విజయసాయిరెడ్డీ.. దివాలాకోరువా?.. మోదీ బానిసవా? అంటూ ఫైరయ్యారు. జగన్ ప్రభుత్వంపై మేం కూడా కామెంట్ చేయగలమని, షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ బలం పెరుగుతుందనే ఇంత అక్కసు వెల్లగక్కుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా?.. బానిసత్వంతో మోదీని జొకడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి సమస్యలు రాకుండా రేవంత్ చూసుకుంటారని దయాకర్ అన్నారు.